కడలి న్యూస్:- భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. NZతో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జడేజా టీమ్ ఇండియాను గెలిపించారు. మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో భారత్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ సమష్టి కృషితో మరో ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఎవరో ఒకరిపై ఆధారపడకుండా జట్టులోని 11 మంది ప్లేయర్లు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. లీగ్ స్టేజీ, సెమీఫైనల్, ఫైనల్ ఇలా ప్రతి రౌండ్లో ఒక్క పరాజయం లేకుండా కప్పు ఎగరేసుకుపోయింది. టీమ్ ఇండియాకు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ.