పర్లాకిమిడి అసెంబ్లీ బిజెడి అభ్యర్థి ఇంజనీర్ రూపేష్ కుమార్ పాణిగ్రహి నామినేషన్ ర్యాలీకి అశేష జనం

 




కడలి న్యూస్, గజపతి జిల్లా, ఒడిశా :-
పర్లాకిమిడి అసెంబ్లీ నియోజక వర్గం బిజెడి అభ్యర్థి ఇంజనీర్ రూపేష్ కుమార్ పాణిగ్రహి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి అశేష జనం హాజరయ్యారు.  నియోజక వర్గం నలు మూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. తన స్వగృహం నుంచి ప్రత్యేక వాహనంలో బయలు దేరిన రూపేష్  ప్రజలకు విక్టరీ సింబల్ చూపిస్తూ, అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మాజీ ఎంఎల్ఏ సూర్యారావు, జడ్పీ చైర్మన్ గవర తిరుపతి రావు, గుసాని బ్లాక్ చైర్మన్ నాగులపల్లి వీర్రాజు, బిజెడి నియోజక అధ్యక్షులు ప్రదీప్ నాయక్,  తదితర ముఖ్య నాయకులతో పాటు నియోజక వర్గంలోని బిజెడి సర్పంచ్ లు  సమితి మెంబర్లు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అశేష జనం  ఆయన వెంట ర్యాలీలో నడిచారు. ముఖ్యంగా బిజూ జనతా దళ్ పార్టీ గుర్తు శంఖం ఉన్న చీరలు ధరించిన మహిళలు, గిరిజన ఆదివాసీల నృత్యాలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రజలు  ర్యాలీలో పాల్గొన్నారు. బిజెడికి జిందాబాద్, నవీన్ బాబుకి జిందాబాద్, రూపేష్ బాబుకి జిందాబాద్ అంటూ అభిమానులు సందడి చేశారు. కొత్త బస్టాండ్ నుంచి సాగిన ర్యాలీ కలెక్టర్ ఆపీస్ వరకు సాగింది. నామినేషన్ అనంతరం రూపేష్ కుమార్ పాణిగ్రహి మాట్లాడుతూ అశేషంగా తరలి వచ్చిన ప్రజలకు ధన్యవాదములు తెలిపారు.

కామెంట్‌లు