ఒడిశాలో దేవస్థానాల దర్శనానికి అనుమతులు


కడలి న్యూస్ ఒడిశా:-
రాష్ట్రంలోని దేవాదాయ శాఖ అధీనంలో మందిరాలు తెరిచేందుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ దేవస్థానాలు తెరిచేందుకు సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. పూరీలోని జగన్నాథుని దేవస్థానం ఇతర ప్రముఖ దేవస్థానాల అధికార, పాలక మండలి వర్గాలకు ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోవిడ్-19 మార్గదర్శకాల పరిధిలో దేవస్థానాలు తెరిచి సాధారణ భక్తులకు ప్రవేశం కల్పించేందుకు స్పష్టమైన కార్యాచరణ దాఖలు చేయాలని ఈ ఉత్తర్వులు పేర్కొన్నాయి. సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించి 10రోజుల్లోగా సమగ్ర నివేదిక జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా ప్రభావంతో గడి చిన 7 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మందిరాలు, ధార్మిక, ఆధ్యాత్మిక, ప్రార్థనా ప్రాంగణాలు మూపడిన విషయం తెలిసిందే.


 


కామెంట్‌లు